Advertisement

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి

(నిర్మల్ జోర్దార్ ప్రతినిధి):

నిర్మల్ జిల్లా కేంద్రంలో మరో జిల్లా అధికారి ఏసీబీ అధికారులకు బుధవారం చిక్కాడు.జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏడి గా పనిచేస్తున్న శ్రీనివాస్ రూ.7వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే నిర్మల్ పట్టణం లోని బుధవార్ పేటకు కాలనీకి చెందిన వెంకటి అనే యువకుడు దడువాయి లైసెన్స్ కోసం మార్చిలో దరఖాస్తు చేసుకున్నాడు.

ఇప్పటివరకు లైసెన్సు ఇవ్వకపోగా,లైసెన్స్ మంజూరు కావాలంటే రూ.10 వేలు ఇవ్వాలని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు.చివరకు రూ.7వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం వెంకట్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.బాధితుడు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో ఏ డి శ్రీనివాస్ ను పట్టుకున్నారు.జిల్లాలో గత రెండు నెలల్లో ముగ్గురు అధికారులు ఏసీబీ అధికారులకు‌ పట్టుబడడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *