Advertisement

భీమదేవరపల్లి ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

ఎట్టకేలకు మహిళకు దక్కిన గౌరవం ఇది: బయోసైన్స్ టీచర్ సుధారాణి

భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి

ఎన్నో దశాబ్దాల క్రితమే మహిళలకు చదువు ఆవశ్యకత గుర్తించి, తెగించి పోరాడి సాధించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే కు రాష్ట్ర ప్రభుత్వం సముచితమైన గౌరవాన్ని కల్పించిందని భీమదేవరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ బోధిస్తున్న సుధారాణి అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి భాయిపూలే సేవలను గుర్తించి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం హర్షనీయమన్నా రు. ఆంగ్ల బోధకులు రాజేంద్రం మాట్లాడుతూ.. చదువుకు నోచని అట్టడుగు వర్గాల మహిళలను, అనేక కష్టనష్టాలకు ఓర్చి అత్యంత సాహసోపేతంగా సావిత్రి భాయి పూలే దంపతులు విద్యావంతులుగా తీర్చిదిద్దిన చరిత్ర విద్యార్థులందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనేక కట్టుబాట్లు, ఎన్నో అవమానాలకు గురైనా వెరవని మహిళగా జ్యోతిబాపూలే చరిత్రలో నిలిచిపోతుందని, ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం అత్యంత హర్షనీయమని తెలిపారు.

ఉపాధ్యాయుడు స్టాలిన్ బేగ్ సావిత్రి భాయి పూలేపై చేసిన గానం విద్యార్థులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎల్లయ్య, మహంకాళి ,శ్రీధర్ రెడ్డి, సమ్మిరెడ్డి ,ప్రదీప్ కుమార్, శ్రీనివాసరెడ్డి మరియు వ్యాయామ ఉపాధ్యాయులు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *