Advertisement

కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

*కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం*

భీమదేవరపల్లి జోర్దార్ విలేకరి

మండలంలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో చిన్నారులు ఉపాధ్యాయుల అవతారం ఎత్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు.

చిన్నారి అక్షర ప్రధానోపాధ్యాయురాలి గా మరియు కొందరు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వేషధారణ చేసి పాఠాలు బోధించడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులలో సృజనాత్మక శక్తులను వెలికితీయుటకు తమ పాఠశాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యంత ఉత్సాహభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పత్తి రాజేందర్ రెడ్డి తో పాటు ఉపాధ్యాయులు లక్ష్మీ , అనిత , సదానంద్ , పద్మ మరియు విజయభాస్కర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *