Advertisement

తహసిల్దార్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం

*భీమదేవరపల్లి లో జాతీయ ఓటర్ల దినోత్సవం*

భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి

భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ ఓటర్ల దినోత్సవం లో భాగంగా నేడు భీమదేవరపల్లి మండల కేంద్రంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. “బుల్లెట్ కన్నా బ్యాలెట్ మిన్న, ఓటే ఆయుధం ఓటే మీ బలం, నోటుకు ఓటు వద్దే వద్దు” లాంటి నినాదాలు చేస్తూ బ్యాండ్ మేళంతో విద్యార్థులు చేసిన ర్యాలీ పలువురిని ఆకట్టుకుంది.

 


అనంతరం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయితీ కార్యాలయం కూడలిలో స్థానిక బి ఎల్ ఓ విద్యార్థులు , గ్రామస్తులు, అధికారులతో ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఉన్నత పాఠశాల జిహెచ్ఎం ప్రభాకర్, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వేణు గోపాల స్వామి, ఉపాధ్యాయులు, తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది, బీఎల్వో అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *