|
(హైదరాబాద్ జోర్దార్ ప్రతినిధి)
మహిళల మనోభావాలను కించపరుస్తూ ఆ సందర్భంగా మాట్లాడిన కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం నిన్న కరీంనగర్ లో ఆల్ఫోర్స్ పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో డీఈఓ జనార్దన్ రావు ప్రసంగిస్తూ ఆడపిల్లలు లేచిపోతారంటూ ఇన్నర్ ఫీలింగ్స్ అంటూ చెత్త ప్రసంగం చేయడం గురించి అదే సభలో ఉన్న మహిళా సోదరీమణులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గంటన్నర సేపు సమయం సందర్భం లేకుండా చెత్త డైలాగులతో డిఈవో జనార్దన్ రావు చేసిన చచ్చు ప్రసంగం పట్ల మహిళా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
విద్యార్థి సంఘాలు కూడా వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలంటూ ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఐదు సంవత్సరాలుగా జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉండి జనార్ధరావు విద్యా ప్రమాణాలు పెంచడానికి ఎలాంటి కృషిచేయకపోగా ఉపాధ్యాయులను వేధించి పలుమార్లు కోర్టు నుంచి చివాట్లు తిన్నారు. ఆర్జెడి స్థాయిలో నుండి ప్రభుత్వం నుంచి ఎన్నోసార్లు విచారణ జరిగే శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి అమ్మాయిలు లేచిపోతారంటూ జిల్లా విద్యాశాఖ అధికారి చేసిన ప్రసంగం గురించి మహిళా సంఘం నేతలు విద్యాశాఖ డైరెక్టర్ నరసింహ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో విద్యాశాఖ డైరెక్టర్ నరసింహ రెడ్డి జోర్దార్ హైదరాబాద్ ప్రతినిధితో మాట్లాడుతూ కరీంనగర్ డిఈవో జనార్దన్ రావు ఉపాధ్యాయుల ముగింపు సభలో మహిళలపై చేసిన అసభ్యకరమైన బూతు పదాలపై జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక తీసుకుని తగిన చర్య తీసుకుంటామని సోమవారం రాత్రి సెల్ఫోన్లో వివరణ ఇచ్చారు.
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద గౌడ్ మాట్లాడుతూ డీఈఓ బూతు పురాణంపై చాలా ఫిర్యాదులు వచ్చినట్టు ఆమె తెలిపారు. డీఈఓ మాటలు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని అమి తెలిపారు.
Leave a Reply