పహల్ గాం అమరులకు విజయనగర్ కాలనీవాసుల నివాళి
హనుమకొండ జోర్దార్ విలేఖరి
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్తాన్ ముష్కరుల దాడిలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ హనుమకొండ లోని విజయనగర్ కాలనీవాసులు క్రొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాలనీ కూడలి నుండి యూనివర్సిటీ క్రాస్ రోడ్ చౌరస్తా వరకు 50 కుటుంబాలు ర్యాలీలో పాల్గొన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు పర్యాటకులపై సాగించిన మారణకాండను నిరసించారు. ఈ అమానుషకాండ తమను ఎంతో కదిలించి వేసిందని అందుకే తమ కుటుంబాలతో సహా అమరులకు నివాళులర్పిస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించామని వారు పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దూర్త పాకిస్తాన్ ను శిక్షించి భారత ప్రభుత్వం సరియైన గుణపాఠం నేర్పాలని వారు కోరారు.

కేయూ కూడలి వద్ద నివాళులు అర్పించిన కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో విశ్రాంత డిఎస్పి నరసయ్య కాలనీ పెద్దలు అర్జున్ రావు, శ్రీనివాస్ కుమారస్వామి, రవి ప్రసాద్ మరియు ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, మురళీధర్, ఉమా ,సంపత్ రావు ,సుధర్మ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply